విద్యార్థుల కోసం పర్యావరణ దినోత్సవాలు కాలమానిని
– ప్రతి ఒక్కరూ ఇంటి దగ్గర ప్రకృతి ఆధారంగా పంటలు పండించాలి.
– ఎం. రాజశేఖరం. జిల్లా ఉద్యానవనాలశాఖ అధికారి, అనకాపల్లి
విద్యార్థుల కోసం గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జి ఒ రూపొందించిన పర్యావరణ దినోత్సవాల కాలమానిని (క్యాలెండర్) 2026 ఆవిష్కరించడం ఆనందదాయకం అని అనకాపల్లి జిల్లా ఉద్యానవనాల శాఖ అధికారి ఎం. రాజశేఖరం అన్నారు. మంగళవారం ఉదయం అనకాపల్లి ఉద్యానవన శాఖ కార్యాలయంలో ఆయన క్యాలెండరు విడుదల చేసిన తర్వాత నగరం లోని మిద్దె తోటల రైతులకు వంజంగి వంకాయ, దేశీయ టమాటా, బంతి, బాపట్ల మిర్చి తదితర మొక్కలు పంపిణీ చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. విద్యార్థులు ఈ కాలమానిని వినియోగించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి అని కోరారు. ప్రతి ఒక్కరూ ఇంటి దగ్గర ప్రకృతి ఆధారంగా పంటలు పండించాలి అని కోరారు. మిద్దె తోటల పెంపకం దారులకు తాము అవసరం అయిన శిక్షణ ఇస్తామన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటి వద్ద కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు జాతి మొక్కలు అధికంగా పెంచాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మేంగొ మేన్ అప్పాజీ, సిఫా సిఇఒ డాక్టర్ శశిప్రభ, యాక్షన్ ఎయిడ్ కర్ణాటక ప్రాజెక్ట్స్ సంస్థ అనకాపల్లి హెచ్ ఆర్ డి ఐ కృష్ణ కుమారి, గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జి ఒ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం, అనకాపల్లి మిద్దె తోటల పెంపకం దారులు పాల్గొని మాట్లాడారు.
విద్యార్థుల కోసం పర్యావరణ దినోత్సవాలు కాలమానిని #vvwnews
6