నోయుడా కార్మికులకు పోరాటానికి మద్దతు తెలపండి జీ వామనమూర్తి పిలుపు#vvwnews

by vvwnews.com

ప్రెస్ నోట్ నోయుడా కార్మికులకు పోరాటానికి మద్దతు తెలపండి జీ వామనమూర్తి పిలుపు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నోయాడా కార్మికులు కనీస వేతనాలు అమలు చేయాలని పోరాటానికి మద్దతుగా తేదీ 23 4 2026 ఉదయం 8 గంటలకి ఇసుకతోట జంక్షన్ వద్ద కార్మికులు చేస్తున్న సమ్మెకు మద్దతుగా ఆందోళన చేశారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎన్ ఎఫ్ ఐ ఆర్ టి డబ్ల్యూ నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ జాతీయ వర్కింగ్ కమిటీ సభ్యులు జి వామనమూర్తి పాల్గొని మాట్లాడుతూఉత్తర ప్రదేశ్ నోయిడాలో కార్మికులు కనీస వేతనాల అమలు చేయాలని చేస్తున్న పోరాటంపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ నిర్బంధాన్ని వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని కార్మికులు కార్మిక సంఘాల నాయకులపై ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులు నిర్బంధాలు వెంటనే ఆపాలని కార్మికుల కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు ఉత్తరప్రదేశ్ కార్మిక వర్గానికి చేస్తున్న పోరాటానికి మోటార్ వాహన కార్మికులు అసంఘటితరం కార్మికులు అండగా ఉంటారని భరోసా ఇచ్చారు తమ న్యాయమైన కోరికల సాధనకు మరిన్ని పోరాటాలకు కార్మిక వర్గం సిద్ధం కావాలని పిలుపునిచ్చారు ప్రధాన నరేంద్ర మోడీ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర కార్మికుల వర్గంపై జరుపుతున్న దాడులను ఖండించాలని కార్మికుల న్యాయమైన హక్కులు అమలు చేయాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ ఆదేశించాలని కోరారు లేని పక్షంలో కార్మికు వర్గం తమ హక్కుల సాధనకు ఉద్యమ పోరాటాలు చేసే ప్రభుత్వానికి కళ్ళు తెరిపిస్తారని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఏ ఐ టి యు సి నాయకులు రావికృష్ణ మక్కా రమణ మక్కా గోవింద్ పి ధనంజూ ఏ రామస్వామి పి కృష్ణ జి రాము బి అసిర్ నాయుడు బి రాము బి నాగరాజు తదితరులు పాల్గొన్నారు ఇట్లు ఎం రమణ స్థానిక సంఘం అధ్యక్షులు
.

Use Social Media to Spread the Word about Our News

related articles