29వ వార్డు వైసిపి అధ్యక్షుడు పీతల వాసు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి దీని ముఖ్య అతిథిగా

by vvwnews.com

29వ వార్డు వైసిపి అధ్యక్షుడు పీతల వాసు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి దీని ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ మాజీ చైర్మన్ జాన్ వెస్లీ హాజరయ్యారు. ముందుగా పీతల వాసుకి కేక్ కట్ చేసి సన్మానం చేశారు , పేద మహిళలకు చీరల పంపిణీ చేశారు. వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ పీతల వాసు ఇంకెన్నో ఇలాంటి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని, ప్రజాసేవలో కూడా నిత్యం పాల్గొంటారని తెలియజేశారు రేపు రాబోయే రోజుల్లో పీతల వాసు కార్పొరేటర్ గా భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని తెలియజేశారు,పీతల వాసు మాట్లాడుతూ రేపు రాబోయే ఎన్నికల్లో వాసుపల్లి గణేష్ కుమార్ ని ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని, అలాగే మంత్రి కూడా అవుతారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన విభాగ సెక్రటరీ కనకాల ఈశ్వరరావు, బెహరా మహేష్, ఎలమంచిలి సంతోష్ కుమార్, గుమ్మడి చంద్రమౌళి, అడపా శివ, బొండాడ వెంకట్రావు, పీతల రాజు పాల్గొన్నారు.

Use Social Media to Spread the Word about Our News

related articles