శ్రీశ్రీశ్రీ పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్న హోం మంత్రి వంగలపూడి అనిత విజయనగరం అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్న అన్నారు *విజయనగరం*
విజయనగరం పైడితల్లి అమ్మవారిని
కుటుంబ సమేతంగా దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేసిన రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత.
ఆలయ అధికారక లాంచనాలు, పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన అధికారులు.
పూజానంతరం అమ్మవారి ప్రసాదాన్ని, చిత్రపటాన్ని బహూకరించిన అధికారులు.
*హోం మంత్రి వంగలపూడి అనిత కామెంట్స్*
ఉత్తరాంధ్రా ఇలవేల్పు పైడితల్లి అమ్మవారు.
ఉత్తరాంధ్రా ప్రజలకు పైడితల్లి అమ్మవారి జాతర శుభాకాంక్షలు.
ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం.
అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారు.
గత సంవత్సరం కన్నా,భక్తులు సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
సిరిమాను మూడు గంటలకు ప్రారంభం అవుతుంది.
భద్రత విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం.
నేను ప్రతీ సంవత్సరం పైడితల్లి అమ్మవారిని దర్శించికుంటాను.
గత సంవత్సరం నన్ను ఇబ్బంది పెట్టారు.
ఇప్పుడు ప్రోటోకాల్ తో అమ్మను దర్శించికునే అవకాశం అమ్మ ఇచ్చింది.
ఎన్డియే ప్రభుత్వంలో ప్రజలు సంతోషంగా ఉండాలని,మరల రాక్షస ప్రభుత్వం రాకూడదని అమ్మను కోరుకున్నాను.
కంట్రోల్ రూమ్ నుండి ఎర్పాట్లు పర్యవేక్షించినా హోం మంత్రి వంగలపూడి అనిత.