విశాఖపట్నం
సింహాచలం అప్పన్న స్వామిని దర్శించుకున్న హోం మంత్రి అనిత.
మంత్రి అనితకు ఘన స్వాగతం పలికిన ఆలయ అధికారులు.
స్వామివారి దర్శనం అనంతరం
వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ మంత్రికి వేద ఆశీర్వచనం చేసిన అర్చకులు.
స్వామివారి చిత్రపటం, ప్రసాదాలను హోం మంత్రికి అందజేసిన అధికారులు.
చందనోత్సవం, స్వామివారి కల్యాణోత్సవం నేపథ్యంలో అధికారులు, అర్చకులతో ఏర్పాట్లపై చర్చించిన మంత్రి అనిత.
*హోం మంత్రి అనిత కామెంట్స్*
గత సంవత్సరం చందనోత్సవానికి 1,20,000 మంది భక్తులు స్వామివారి దర్శనానికి రావడం జరిగింది.
ఈ సంవత్సరం భక్తులు సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
ఈనెల ఆఖరిలో మంత్రుల బృందం చందనోత్సవం ఏర్పాట్లపై సమీక్షించనున్నాం.
సామాన్య భక్తుల దర్శనానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం.
గ్యాస్ సంక్షోభం లేకుండా ప్రభుత్వం అప్రమత్తమైంది.
సీఎం చంద్రబాబు RTGS నుండి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
RTGS రాష్ట్రానికి గుండె లాంటిది.
సీఎం చంద్రబాబు అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు.
దయచేసి వదంతులను నమ్మొద్దు.
సామాజిక మాధ్యమాల వేదికగా కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు.