హలో కామ్రేడ్ చలో ఖమ్మం కు తరలి రండి జి వామనమూర్తి పిలుపు #news

by vvwnews.com

హలో కామ్రేడ్ చలో ఖమ్మం కు తరలి రండి జి వామనమూర్తి పిలుపు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నూరు వసంతాల సందర్భంగా తేదీ 9=1= 2026 ఉదయం 10 గంటలకు అక్కయ్యపాలెం 80 పిట్ రోడ్లో లో సిపిఐ జెండాను కే రాము ఆవిష్కరించారు అనంతరం జరిగిన సభను ఉద్దేశించి సిపిఐ నాయకులు జి వామనమూర్తి పాల్గొని మాట్లాడుతూ సిపిఐ నూరు వసంతాల సందర్భంగా తేదీ 18-1 26న ఖమ్మంలో జరుగు బహిరంగ సభకు కార్మికులు ప్రజలు రైతులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా కార్మిక రైతంగ వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ప్రైవేటు బడ కార్పొరేట్ సంస్థలకు లక్షల కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తూ ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నాయని మండిపడ్డారు ప్రధాని నరేంద్ర మోడీ బిజెపి ప్రభుత్వం కార్మిక వర్గ హక్కులను హరిస్తున్నాయని మండిపడ్డారు దేశంలో కార్మికుల పోరాడి సాధించుకున్న 8 గంటల పని విధానాన్ని 44 కార్మిక చట్టాలను నాలుగు కోడలు గా మార్చి కార్మిక వర్గంపై పని భారం పెంచే విధానాలను వెంటనే రద్దు చేయాలని కార్పొరేట్ సంస్థలకు ఇస్తున్న రాయితీలను ఆపాలని డిమాండ్ చేశారు అమెరికన్ సామ్రాజ్యవాదం వెనిజులా దేశ అధ్యక్షుడు నీ నిర్బంధించి ప్రపంచంలో యుద్ధం మేఘాలను ప్రేరేపిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు యుద్ధం వద్దు శాంతి ముద్దని భారత ప్రజలు శాంతి ఉద్యమాలు చేయుటకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు సిపిఐ నాయకులు అబ్దుల్ రజాక్ జి లక్ష్మణరావు లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్థులైన ప్రభుత్వం భూములను మెడికల్ కాలేజీ లనుప్రైవేటు బడ కాంట్రాక్టర్లకు పి పి పి పేరట కట్టబెట్టడానికి చేస్తున్న ప్రభుత్వ విధానాలను ప్రతిఘటించాలని ప్రజలకు పిలుపునిచ్చారు ప్రజలందరికీ విద్య వైద్యం ప్రభుత్వం ఆధ్వర్యంలోనే అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు లేనిపక్షంలో దశల వారి ప్రజా ఆందోళన చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు కార్యక్రమంలో కేలం శివ జీ శ్రీనివాసరావు కే కోటేశ్వరరావు అప్పలరాజు సతీష్ వి భాస్కరరావు శ్రీమతి ఆర్ రమ్య తదితరులు పాల్గొన్నారు ఇట్లు జి లక్ష్మణరావు సిపిఐ నాయకులు

Use Social Media to Spread the Word about Our News

related articles