41వ వార్డు లో జగనన్న జన్మదినోత్సవం..ఘనంగా ముందస్తు సంబరాలు కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్

by vvwnews.com

41వ వార్డు ఆధ్వర్యంలో జగనన్న జన్మదినోత్సవం…

* ఘనంగా ముందస్తు సంబరాలు చేసిన కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ, శ్రీధర్లు

కంచరపాలెం, డిసెంబర్ 13, (ఆంధ్రప్రభ): దక్షిణ నియోజకవర్గ పరిధి
41వ వార్డ్ వైసీపీ కోర్పరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ, కోడిగుడ్ల శ్రీధర్ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ముందస్తు జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ఈ సందర్బంగా మధురవాడ జాతరలో వార్డు వైసీపీ శ్రేణులు, ప్రజలతో కలిసి పలు సంస్కృతిక కార్యక్రమాల నడుమ ఆటపాఠలు ఏర్పాటు చేసి పండగ వాతావరణం లో పూర్ణిమ, శ్రీధర్ కేక్ కట్ చేసారు.అనంతరం మహిళలకు పలు ఆటల పోటీలు నిర్వహించి బహుమతులను అందజేశారు. ఈ సందర్బంగా కోడిగుడ్ల శ్రీధర్, కోడిగుడ్ల పూర్ణిమ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి మహిళా సాధికారత కోసం పెద్ద పిఠ వేసారన్నారు. జగన్ పాలనలో మహిళలకు స్వర్ణయుగమని గుర్తు చేశారు. అందుకే జగన్ స్ఫూర్తి తో నేడు వార్డ్ మహిళల కోసం ఈ వేడుకలు ఏర్పాటు చేశామన్నారు.కూటమి ప్రభుత్వం పాలనలో రాష్ట్రం కుంటుపడిందని, మహిళా సాధికాత సన్నగిల్లిందని అన్నారు.ప్రజలు మళ్ళీ జగన్ పాలననే కోరుకుంటున్నారని,వచ్చేది వైసీపీ ప్రభుత్వమేనని స్పష్టం చేసారు.జగన్మోహన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని ముందుగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం ఎంతో సంతృప్తినిస్తుందన్నారు.తమను ఎంతగానో అందరిస్తున్న వార్డ్ ప్రజలకు, మహిళలకు రుణపడి ఉంటామన్నారు. ఈ సందర్బంగా మహిళలకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి బహుమతులు అందజేసారు. అనంతరం ఏర్పాటు చేసిన సంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. కార్యక్రమం లో వైసీపీ సీనియర్ నాయకుడు వేళంగిని రావు, కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Use Social Media to Spread the Word about Our News

related articles