విశాఖ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ కీర్తిశేషులు పైడా కౌశిక్ నాటక ఉత్సవాలు 2025 ఏప్రిల్ 12th to 16th

by vvwnews.com

కళాభారతి – కీ॥శే॥ పైడా కౌషిక్ నాటకోత్సవములు – 2025

20వ రాష్ట్రస్థాయి ఆహ్వాన సాంఘిక నాటికల పోటీలు – 2025

ప్రెస్ మీట్ తేదీ: 10-4-2025 ఉదయం 9 గం.
వేదిక: కళాభారతి, విశాఖపట్నం
——————————
కళాభారతి (ఏ.సి) ఆడిటోరియంలో 10 ఏఫ్రియల్, 2025 న జరిగిన ప్రెస్ మీట్ సమావేశంలో వి.ఎమ్.డి.ఎ. మరియు నాటకోత్సవాల అధ్యక్షులు శ్రీ మంతెన సత్యనారాయణరాజు మాట్లాడుతూ, గత 20 సంవత్సరాలుగా నిర్వహించబడుతున్న నాటకోత్సవాలు, ఈ ఏడాది 12, 13, 14, 15 మరియు 16 ఏఫ్రియల్, 2025 తేదీలలో నిర్వహంచబడుతున్నాయని, రెండు తెలుగు రాష్ట్రాలనుంచి మొత్తం 28 ఎంట్రీలు ఈ ఏడాది వచ్చాయని, వాటినన్నింటిని ప్రోగ్రాం కమిటీ సభ్యులందరూ అధ్యయనం చేసి 9 నాటికలను ఎంపిక చేశారని, మొదటి నాలుగు రోజులు, రోజుకు రెండు నాటికలు, చివరి రోజు 16-4-2025 తేదీన ఒక నాటిక ప్రదర్శించబడి, ఆ తరువాత వెంటనే బహుమతి ప్రదానోత్సవం జరుగునని వివరించారు.

వి.ఎమ్.డి.ఎ. ట్రస్టీ మరియు నాటకోత్సవాల ప్రధాన కార్యదర్శి శ్రీరామాదాస డా. జి.ఆర్.కె. ప్రసాద్ (రాంబాబు) మాట్లాడుతూ, ఈ పోటీలలో నాటికలను ప్రదర్శించే స్థానికేతర సమాజాలముల వారికి ప్రదర్శన పారితోషికం రూ॥ 16,000/- లతో పాటు లోకల్ కన్వేయన్స్ నిమిత్తం రూ॥ 4000/- అదనంగా అందజేయబతున్నదని, మరియు ప్రదర్శన రోజున మాత్రం వీరికి వసతి ఉచితంగా ఏర్పాటు చేయబడుతున్నదని తెలిపారు. ఈ పోటీలలో నాటికలను ప్రదర్శించే స్థానిక సమాజాలముల వారికి ప్రదర్శన పారితోషికం రూ॥16,000/- లతో పాటు అదనంగా లోకల్ కన్వేయన్స్ నిమిత్తం రూ॥ 2000/- అందజేయబతున్నదని తెలిపారు. ఈ పోటీలలో గెలుపొందిన వారికి, ఉత్తమ ప్రదర్శనకు రూ॥18,000/-లు, ద్వితీయ ఉత్తమ ప్రదర్శనకు రూ॥15,000/-లు, తృతీయ ఉత్తమ ప్రదర్శనకు రూ॥12,000/- లు చతుర్థ ఉత్తమ ప్రదర్శనకు రూ॥ 10,000/-లు నగదుతో పాటు జ్ఞాపికలు అందజేయబడుతాయని, ఇవిగాక 12 వ్యక్తిగత బహుమతులు ఒక్కొక్కరికి రూ॥ 1500/-లు మరియు జ్ఞాపికలు అందజేయబడుతాయని, మూడు జ్యూరీ బహుమతులు ఒక్కొక్కరికి రూ॥ 1000/-లు నగదుతో పాటు జ్ఞాపికలు అందజేయబడుతాయని, ప్రోత్సాహక బహుమతుల క్రింద నాటికలలో పాల్గోన్న ప్రతి బాల, నటీ నటులకు రూ॥ 1000/- లు నగదుతో పాటు జ్ఞాపికలు బహూకరించబడతాయని, ఈ పోటీలలో ప్రదర్శించిన ప్రతి నాటిక రచయిత, దర్శకుడికి Multi coloured laminated Certificates లను నాటిక ప్రదర్శన అనంతరం, వేదిక మీద అందజేయబడుతాయని తెలియజేశారు.

నాటకోత్సవాల మహారాజపోషకులు
శ్రీ పైడా కృష్ణప్రసాద్ మాట్లాడుతూ, తెలుగు నేలమీద ప్రఖ్యాతిగాంచిన ఈ నాటకోత్సవాలకు మహారాజపోషకులుగా వుండటం తనకు చాలా సంతోషాన్ని కలిగిస్తోందని, రాబోయే కాలంలో కూడా ఈ నాటకోత్సవాల నిర్వహణకు తనవంతు సహాయ సహకారాలు ఇలాగే కొనసాగిస్తానని చెప్పారు. అన్ని రోజులు నాటికల ప్రదర్శనలకు ప్రవేశం ఉచితమని, వచ్చిన ప్రేక్షకులకు ప్రతిరోజు లాటరీ తీసి 1st, 2nd & 3rd బహుమతులు ఏ రోజుకారోజు నాటికల ప్రదర్శనల అనంతరం ఇవ్వబడుతాయని, మరలా అన్ని రోజులకు (5 రోజుల కూపన్లు) కలిపి 1st, 2nd, 3rd & 4th బహుమతులు ఇవ్వబడుతాయని తెలియజేశారు. నాటకోత్సవాల చీఫ్ కన్వీనర్ డా॥ కె.జి. వేణు, నాటకోత్సవాలలో ఏర్పాటుచేస్తున్న మహాప్రాంగణకర్త డాక్టర్ (శ్రీమతి) ఎ. మంగళగౌరిగారు మరియు రోజువారి ప్రాంగణకర్తల వివరాలను అందజేశారు.. ఛీఫ్ అడ్వైజర్ ఆచార్య బాబివర్ధన్ మాట్లాడుతూ, ఈ నాటకోత్సవాల విజయంలో పాత్రికేయుల పాత్ర చాలా విశిష్టమైనదని, ఈ ఉత్సవాల సమాచారాన్ని రెండు రాష్ట్రాలలోని అన్ని ప్రాంతాల వారికి తెలియజేసే బాధ్యతను పాత్రికేయమిత్రులు స్వీకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాటకోత్సవాల ఎగ్జిక్యూటివ్ కన్వీనర్స్ శ్రీ బొడ్డేటి జగత్ రావు, శ్రీ వర్రె నాంచారయ్యలతో పాటు ఇతర కార్యవర్గసభ్యులు, పట్టణంలోని ఎలక్ట్రాన్ మీడియా మరియు ప్రింటు మీడియా ప్రతినిధులందరూ పాల్గొన్నారు

Use Social Media to Spread the Word about Our News

related articles