తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి పవిత్ర ప్రసాదం లడ్డూ తయారీలో కల్తీ చేసిన నెయ్యి వినియోగం.#vvwnews

by vvwnews.com

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి పవిత్ర ప్రసాదం లడ్డూ తయారీలో కల్తీ చేసిన నెయ్యి వినియోగం భక్త జనకోటి మనోభావాలను దెబ్బ తీసింది. గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన పాలక మండలి వ్యవహార శైలి, లడ్డూ కల్తీ ద్వారా చేసిన అపచారానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్షకు శ్రీకారం చుట్టారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావంగా
జనసేన పార్టీ విశాఖ నగర అధ్యక్షులు, దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు ఎల్ఐసి బిల్డింగ్ వద్ద మహా యాగం నిర్వహిస్తున్నారు. . ఈ కార్యకమంలో హోమం నిర్వహించి, దీక్షలో పాల్గొన్నారు.
ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్. గారు మాట్లాడుతూ “తిరుమల ప్రసాదాన్ని భక్తులు పరమ పవిత్రంగా భావిస్తారు. లడ్డూ తయారీలో కల్తీని కలలో కూడా ఊహించలేము. ఈ ఘటనపై ప్రతి ఒక్కరిలో వేదన ఉంది. గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావం తెలియచేయడం అందరి బాధ్యత. దైవానికి ఎవరి వల్ల అపచారం జరిగినా… అపచారం చేసినవారికి ఆ పశ్చాత్తాప భావన లేకపోయినా లోక క్షేమం కోసం ప్రాయశ్చిత్త దీక్ష చేయాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు సంకల్పించారనీ అన్నారు. రేపటి నుంచి మరిన్ని కార్యక్రమాలు చేస్తామని అన్నారు.

Use Social Media to Spread the Word about Our News

related articles