ప్రతి ఒక్కరూ వారి యొక్క ఓటు వినియోగించుకోవాలి 18 దాటిన ప్రతి ఒక్కరు ఓటు వేయాలి గ్రీన్ క్లైమేట్ టీం

by vvwnews.com

ఓటర్లు అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి
-18 సంవత్సరాలు దాటిన వారంతా ఓటు వేయాలి.
– ఓటు వేయండి ప్రజాస్వామ్యాన్ని బ్రతికించండి
మన ఓటు మన భవిష్యత్తు
– డాక్టర్ శశిప్రభ, సిఇఒ, సీఫా ట్రస్ట్
ఓటర్లు అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి అని సీఫా ట్రస్ట్ సిఇఒ డాక్టర్ శశిప్రభ కోరారు. ఈ మేరకు సీతమ్మధార రైతు బజార్లో, జంక్షన్ లో , మురళీ నగర్ లో భారత ఎన్నికల సంఘం తరఫున స్వీప్ కార్యక్రమాన్ని సీఫా ట్రస్ట్, గ్రీన్ క్లైమేట్ టీం తదితర ఎన్ జి ఒ లు నిర్వహించాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి అనే అంశం మీద అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ18 సంవత్సరాలు దాటిన వారంతా ఓటు హక్కును పొందాలి, ఓటు వేయాలి అని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని బతికించాలని కోరారు. మన ఓటే మన భవిష్యత్తును నిర్ణయిస్తుందని, ఐదేళ్లపాటు మనల్ని సజావుగా పాలించే నాయకులను ఎన్నుకునే బాధ్యత మనపై ఉందన్నారు . అందుకే మనమంతా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు .
ఈ కార్యక్రమంలో గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జి ఒ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం మాట్లాడుతూ
భారత రాజ్యాంగం పేద, ధనిక, కులం, మతం, వర్ణం అనే బేధం లేకుండా భారతీయులందరికీ ఓటు హక్కుని కల్పించిందన్నారు. ఈ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవడం మన బాధ్యతగా ప్రతి ఒక్కరు గుర్తించాలన్నారు . మేధావులు విద్యార్థులు కర్షకులు కార్మికులు ఉద్యోగులు నిరుద్యోగులు అమ్మలు అక్కలు అన్నలు వృద్ధులు యువకులు అనే తారతమ్యం లేకుండా 18 ఏళ్ల పైబడిన వారంతా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు . ఆశించే మార్పు రావాలంటే శాసించే మీ ఓటు వేయాలని కోరారు. మనకు ఇష్టమైన నాయకులు పోటీలో లేకుంటే “నోటా” బటన్ నొక్కి పైన ఉన్న వారెవరూ కాదు అని ఓటు హక్కును వినియోగించుకోవచ్చు అన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా మానవ సేవే మాధవ సేవ సంస్థ ప్రతినిధి భాను ప్రకాష్, ఏక్షన్ ఎయిడ్ ఫెలోషిప్ ప్రతినిధి కృష్ణకుమారి, సిఫా సంస్థ ప్రతినిధులు రామలక్ష్మి, భాస్కర్, నర్సింగ్ తదితరులు పాల్గొని మాట్లాడారు.

Use Social Media to Spread the Word about Our News

related articles