డాక్టర్ లంకపల్లి బుల్లయ్య ఇంజినీరింగ్ కళాశాల L&T ఎడ్యుటెక్ తో కలిసి మొదటి మరియు రెండవ సంవత్సరం ఇంజనీరింగ్ విద్యార్థుల కోసం కాలేజ్ కనెక్ట్ ప్రోగ్రామ్ మరియు, మూడవ సంవత్సరం మరియు ఫైనల్ ఇయర్ ఇంజనీరింగ్ విద్యార్థుల కోసం ఎంప్లాయబిలిటీ స్కిల్లింగ్ ప్రోగ్రామ్ను ప్రారంభించబడుతున్నదని తెలియజేయడానికి సంతోషిస్తున్నాము.
దీనికి సంబంధించి ఇంజినీరింగ్ కళాశాల క్యాంపస్లో ఈ కార్యక్రమాలను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించేందుకు ఇరుపక్షాల మధ్య ఎంవోయూపై సంతకాలు చేయడం జరిగింది.
ఇంజినీరింగ్ సంబంధిత శాఖలలో అవసరమైన సాంకేతిక నైపుణ్యాలను అందించడం ద్వారా పరిశ్రమ మరియు విద్యాసంస్థల మధ్య అంతరాన్ని ఈ ప్రోగ్రామ్ భర్తీ చేస్తుంది.
ఈ కార్యక్రమంలో L&T ఎడ్యుటెక్ కాలేజ్ కనెక్ట్ బిజినెస్ హెడ్ Ms. M. F. ఫెబిన్, L&T ఎడ్యుటెక్ రీజనల్ మేనేజర్ శ్రీ మయాంక్ రంజన్, కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డాక్టర్ జి. మధు కుమార్; డా. లంకపల్లి బుల్లయ్య ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ దీపక్, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.