ఆడుదాం ఆంధ్రా పేరుతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొన్ని కోట్ల దుర్వినియోగం జనసేన కార్పొరేటర్ గురుమూర్తి

by vvwnews.com

జనసేన నేత మూర్తి యాదవ్ కామెంట్స్….

జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో క్రీడలపై, క్రీడాకారులపై ప్రేమ పెరిగిపోయింది.

ఆడుదాం ఆంధ్ర అనేది పూర్తిగా అవినీతిమయం.

రాష్ట్ర ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర కి 120 కోట్లు వెచ్చించి అవినీతి చేసింది.

ఆడుదాం ఆంధ్ర లో క్రీడాకారులకు సరైన వసతి భోజనాలు కూడా లేకుండా చేసింది ఈ ప్రభుత్వం.

ఆడుదాం ఆంధ్రా కి ఈ ప్రభుత్వం ఎంత కర్చుపెట్టిందో ఒక శ్వేత పత్రం విడుదల చేయగలదా.

ఆంధ్రాలో ఆడుదాం ఆంధ్ర ఆడిన క్రీడాకారులందరూ ఆయా జిల్లాల కలెక్టర్లను నిలదీసే పరిస్థితి ఏర్పడింది.

ఆడుదాం ఆంధ్రాలో న్యాయ నిర్ణీతలుగా మరియు రిఫరీ గా వున్న వారికి ఎటువంటి చెల్లింపులు ఇప్పటివరకు జరగలేదు.

ఆటల్లో గెలుపు ఓటమి లో కూడా అవకతవకలు జరిగాయని క్రీడాకారులు ఆరోపిస్తున్నారు.

జగన్మోహన్ రెడ్డికి క్రీడల మీద అభిమానం ఉంటే క్రీడాకారుల కోసం క్రీడా మైదానాలు నిర్మించవచ్చు.

పూర్తిస్థాయిలో క్రీడాకారులను అవమానించి చేసింది ఈ ఆడుదాం ఆంధ్రా.

ఆడుదాం ఆంధ్ర పూర్తిగా అవినీతిలో కూరుకు పోయింది.

Use Social Media to Spread the Word about Our News

related articles