ప్రెస్ నోట్ – తెలుగు (ఫైనల్)
డా. ఎం. సృజన దేవి ‘ఫారెవర్ మిస్ యూనివర్స్ ఇండియా 2025’గా కిరీటధారి
జైపూర్, డిసెంబర్ 21, 2025:
Forever Star India – మిస్ యూనివర్స్ ఇండియా 2025 గ్రాండ్ ఫినాలే డిసెంబర్ 21, 2025న జైపూర్లోని Z స్టూడియోస్లో ఘనంగా నిర్వహించబడింది.
దేశవ్యాప్తంగా సుమారు 10,000 మంది పోటీదారుల నుంచి, 100 మంది ఫైనలిస్టులు ఎంపికయ్యారు. పలు దశల పోటీల అనంతరం ఆత్మవిశ్వాసం, వ్యక్తిత్వం, మేధస్సు, సామాజిక అవగాహనలో అత్యుత్తమ ప్రతిభ చూపిన డా. ఎం. సృజన దేవి (ఎం.డి – అనస్థీషియా) ‘ఫారెవర్ మిస్ యూనివర్స్ ఇండియా 2025’గా విజేతగా నిలిచారు.
ఈ జాతీయ స్థాయి పోటీలను సీఈఓ Rajesh Agarwal మరియు డైరెక్టర్ Jaya Chauhan సమర్థ నాయకత్వంలో నిర్వహించారు.
వైద్య వృత్తిలో కొనసాగుతున్న డా. సృజన దేవి విజయం, యువతకు ముఖ్యంగా మహిళలకు గొప్ప ప్రేరణగా నిలుస్తోంది.
వేషధారణ స్పష్టీకరణ:
గ్రాండ్ ఫినాలేలో డా. ఎం. సృజన దేవి గారిని ప్రత్యేకంగా Asvattha Makeovers సంస్థ, ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ & మేకప్ ఆర్టిస్ట్ మిస్ రాజి పర్యవేక్షణలో స్టైలింగ్ చేసింది.
ఈ కార్యక్రమం ఆధునిక భారతీయ మహిళా ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా నిలిచింది.