బురుజుపేటలో వెలసిన శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాలు మార్గశిర శుద్ధ పాడ్యమి 21112025

by vvwnews.com

ఉత్తరాంద్ర ప్రజల కల్పవల్లి, విశాఖ సిరుల తల్లి బురుజుపేటలో వెలసిన శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాలు మార్గశిర శుద్ధ పాడ్యమి అనగా 21.11.2025 శుక్రవారం నుంచి ప్రారంభమయి మార్గశిర బహుళ అమావాస్య అనగా 19.12.2025 శుక్రవారం వరకు జరుగును. ఈ సందర్బంగా ఈఓ శోభారాణి మాట్లాడుతూ ఈ మార్గశిర మాసం సందర్బంగా భక్తులకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, ముఖ్యంగా లక్ష్మివారాలనాడు రద్దీ దృష్ట్యా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని అన్నారు. కిందటి ఏడాది కంటే ఈ ఏడాది క్యూ లైన్లు పెంచుతున్నామని చెప్పారు. 21.11.25 శుక్రవారం జ్యోతి ప్రజ్వలన మరియు తొలిపూజ జరుగును. 13.12.25 న రధయాత్ర జరుగును. 18.12.2025 న సహస్ర ఘఠాభిషేకం జరుగును. లక్ష్మీవారం రోజు మాత్రం వి.ఐ.పి దర్శనం రూ.100/-
విశిష్ఠ దర్శనం రూ. 500/-, శీఘ్రదర్శనం రూ. 200/- నిర్ణయించారు.

Use Social Media to Spread the Word about Our News

related articles