*🔥 ప్రజల గొంతుకగా ముందుకు – కూటమి వైఫల్యాలపై ఘాటు స్వరం*
*📍 నెల్లిమర్ల నియోజకవర్గం | డెంకాడ మండలం | పెద్దతాడివాడ | 05 ఏప్రిల్ 2026:*
ప్రజలతో మమేకమై వారి సమస్యల పరిష్కారమే నిజమైన నాయకత్వమని, గ్రామాల అభివృద్ధి కోసం ప్రతి నాయకుడు బాధ్యతగా ముందుకు రావాలని *ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) గారు* పేర్కొన్నారు.
నెల్లిమర్ల నియోజకవర్గం డెంకాడ మండలం పెద్దతాడివాడలోని దంతులూరి వెంకట సింహాద్రి రాజు కల్యాణ మండపంలో మాజీ శాసనసభ్యులు బడుకొండ అప్పలనాయుడు గారి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమం బడుకొండ ప్రదీప్ నాయుడు గారు, బడుకొండ మణిదీప్ నాయుడు గారి పర్యవేక్షణలో ఘనంగా జరిగింది.
🎤 ఈ సందర్భంగా చిన్నశ్రీను గారు మాట్లాడుతూ:
✔️ ఐదేళ్లు సర్పంచులుగా, నగర పంచాయతీ చైర్మన్లుగా, కౌన్సిలర్లుగా ప్రజలకు సేవలందించిన మీ అందరిని అభినందించారు
✔️ వైఎస్ఆర్సిపి పాలనలో మూడు సంవత్సరాలు, కూటమి పాలనలో రెండు సంవత్సరాలు అందించిన సేవలు ప్రశంసనీయమన్నారు
✔️ ప్రలోభాలకు లొంగకుండా పార్టీకి అండగా నిలిచిన నాయకులను ప్రత్యేకంగా అభినందించారు
✔️ ప్రజల తలలో నాలుకగా ఉండి నిరంతరం సేవ చేయాలని సూచించారు
🟢 వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, బొత్స సత్యనారాయణ గారి మార్గదర్శకత్వంలో జిల్లా పార్టీ తరఫున ఎల్లవేళలా మీకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
🔥 రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, ప్రజల గొంతుకగా నిలవాలని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
⚠️ నెల్లిమర్ల నియోజకవర్గంలో కూటమి ఎమ్మెల్యే ఎన్నికల అక్రమాలపై ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి రావడం ఉత్తరాంధ్ర చరిత్రలోనే తొలిసారి అని విమర్శించారు.
⚠️ కూటమి పాలనలో ప్రజా సమస్యలను పట్టించుకోకుండా స్వప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు.
⚠️ మొక్కజొన్నకు కేంద్రం ప్రకటించిన మద్దతు ధర అమలు కాకపోవడంతో రైతులు నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
📢 రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు ఎన్నో సమస్యలతో పోరాడుతున్నా ప్రభుత్వంలో స్పందన లేకపోవడం బాధాకరమని తెలిపారు.
👉 ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూటమి కుప్పకూలడం ఖాయమని అన్నారు.
👥 ఈ కార్యక్రమంలో:
ఎమ్మెల్సీ పెన్మత్స సురేష్ బాబు గారు, పార్లమెంట్ పరిశీలికులు కిల్లి సత్యనారాయణ గారు, నియోజవర్గ పరిశీలికలు నెక్కల నాయుడు బాబు గారు జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.