15
*హోటల్ గా రుషికొండ ప్యాలెస్?*
AP: రుషికొండ ప్యాలెస్ను హోటల్గా మార్చే అవకాశం ఉందని మంత్రివర్గ ఉపసంఘం పేర్కొంది. ఇందుకు తాజ్, లీలా ప్యాలెస్, అట్మాస్ కోర్, ఫెమా సంస్థలు ఆసక్తి చూపాయని మంత్రులు కేశవ్, దుర్గేశ్ వెల్లడించారు. మాల్దీవులు, పుదుచ్చేరి బీచ్ హోటల్స్పై చర్చించామన్నారు. ప్రజలకు పనికొచ్చేలా, ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా రిషికొండ ప్యాలెన్ వినియోగిస్తామన్నారు. ఈ నెల 28న మరోసారి దీనిపై చర్చిస్తామన్నారు.