బాలల దినోత్సవం సందర్భంగా తాటిచెట్లపాలెం విశ్వతేజ స్కూలు ఆధ్వర్యంలో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విశ్వతేజ స్కూల్ కరస్పాండెంట్ భాస్కరరావు, ప్రిన్సిపల్ సునీత నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ఎక్స్ చైర్మన్ రోటరీ క్లబ్ జి.ఎస్ రాజు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దేశ మొదటి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జయంతి, బాలల దినోత్సవం పిల్లలతో కలిసి నిర్వహించడం చాలా ఆనందదాయకమన్నారు. నెహ్రూకు పిలల్లలతో వున్న బాంధవ్యాన్ని తెలుపుతూ ఈ ఉత్సవం జరుపుకుంటారని పిల్లలు నెహ్రూను చాచా నెహ్రూ అని ప్రేమగా పిలిచేవారని ఆయన అన్నారు. ప్రతి ఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. అనంతరం పిల్లలకు ఆటల పోటీలలో గెలిచిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.
బాలల దినోత్సవం సందర్భంగా తాటిచెట్లపాలెం విశ్వతేజ స్కూలు ఆధ్వర్యంలో బాలల దినోత్సవ వేడుకలు
15