2886501
సాక్షిరాజిత న్యాయ !!
రాజ్యాధికారం ॥
బేడ (బుడ్డ) జంగం హక్కుల పోరాట సమితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటి
అడ్రస్: 1-147ఎ/32-1-19 కొత్త
బస్తాండు దగ్గర, శారదా లాడ్జి ప్రక్క సంధు.
నందికొట్కూరు 518401,
కర్నూలు జిల్లా, సెల్: 9000480522
ఎలమర్తి మధు రాష్ట్ర అధ్యక్షులు
১০:
ప్రెస్ నోట్
ఆంధ్రప్రదేశ్ లో బేడ (బుడ్డ) జంగం కమ్మునిటి SC 59 కులాలో సీరియల్ నెం: 9 లో బేడ (బుడ్డ) జంగం రాజ్యాంగ డాం, బాబా సాహెబ్ అంబేద్కర్ గారు Sందు పరచటం జరిగినది. 2008 వరకు ఉమ్మడి రాష్ట్రంలో SC సర్టిఫికేట్ పొందుతూ ఉంటేడ్కర్ గారు ద్రప్రదేశ్ లో బేడ (బుడ్డ) జంగం పేరుతో బోగస్ సర్టిఫికెట్స్ మంజూరు అవుచున్నవి అని నిజమైనము (బుడ్డ) జంగం వారికి 144 జిఓ రావడం 2008-7-17 వ తేదీ నుండి ఇప్పటి వరకు కాస్ట్ సర్టిఫికేట్ లేక ఇబ్బందులకు గురి అవుతున్నాము. ఈ అంశం పైన రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఉద్యమాలు చేయడం వలన గత ప్రభుత్వం గుర్తించి జేసి.శర్మ కమిషన్ వేయటం జరిగినది. కమిషనర్ గారు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ఈ ఆంద్రప్రదేశ్ లో బేడ బుడ్గ జంగం వారు రాజ్యాంగం ప్రకారంగా ఎస్సి కమ్యూనిటీ కి సంబందించిన వారు. వీరికి అంటరానితనం ఉంది. వాళ్ళ ఆచార పద్ధతులు వేరు. వీరు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా విద్యాపరంగా అభివృద్ధి పరం గా అనేక విధాలుగా వెనుకబడి ఉన్నారు. కాబట్టి ఎస్సి లు గా గుర్తిస్తూ నివేదికను రాష్ట్ర ప్రభుత్వము చేతికి అందించటం జరిగినది. ఈ నివేదికను 25-09-2023 న ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ వై.యస్.జగన్ మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ లో తీర్మానము చేసి కేంద్రప్రభుత్వానికి పంపించటం జరిగినది. కేంద్రప్రభుత్వం మరలా ఈ నివేదికను రిటర్న్ ఆంధ్రప్రదేశ్ ప్రిన్సిపాల్ సెక్రటరీకు 04-12-2024 కు పంపడం జరిగినది. ఇప్పటికి 2 నెలలు అయినా ఈ నివేదికపై ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము ఏ మాత్రం చర్య తీసుకోవటం లేదు. మంత్రి నారా లోకేశ్ గారు యువగలం పేరుతో పాద యాత్ర చేస్తున్న సందర్భాలలో ప్రతి నియోజకవర్గంలో బేడ (బుడ్గ) జంగం కమ్మ్యూనిటీ కి ఇప్పుడు ఉన్న ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. వచ్చేది మన ప్రభుత్వమే తప్పకుండా మీకు కేంద్రలో ఒప్పించి చట్టబద్ధత కల్పిస్తూ మీకు ఎస్సి సర్టిఫికేట్ లు మంజూరు చేసి బేడ (బుడ్గ) జంగం కమ్మ్యూనిటికి న్యాయం చేస్తాను అని హామీ ఇవ్వటం జరిగినది. ఒక పక్కనేమో గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారుపర్యటిస్తూ బేడ (బుడ్గ) జంగం కమ్మ్యూనిటికి రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బందుల్లో ఉన్నారు తప్పకుండా మా ప్రభుత్వం ఒచ్చిన వెంటనే న్యాయంచేస్తాను అని ప్రతి బహిరంగ సభ లో రోడ్ షో లో మాట ఇవ్వటం జరిగినది. కానీ ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు అయినా ఇప్పటి వరకు ఈ బేడ (బుడ్గ) జంగం కమ్మ్యూనిటిని పట్టించుకోలేదు. కేంద్రం నుంచి వచ్చినటువంటి నివేదిక పై ఎటువంటి చర్యలు తీసుకోకపోగా రాష్ట్రంలో బేడ (బుడ్గ) జంగం కమ్మ్యునిటి అనేక ఇబ్బందులకు గురి అవుతున్నాము. ఇప్పటికి అయినా తక్షణమే మీరు ఎలక్షన్ ముందు ప్రజలకి ఇచ్చిన మ ప్రకారంగా మాటలు నిలబెట్టుకోవాలని కోరుతూ చర్యలు తీసుకోవాలని నివేదికను మరలా తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని కోరుచున్నాము లేని ఎడల రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ ముందు రిలే నిరాహార దీక్షలతో పాటు ఆందోళన చేస్తామని తెలియజేస్తున్నాము
రాష్ట్ర అధ్యక్షుడు వై మధు