31 తేదీల్లో విశాఖలో సిపిఐ జాతీయ కార్యవర్గ సమావేశాలు*
*విజయసాయిరెడ్డి అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలి*
*మీడియా సమావేశంలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జెవి సత్యనారాయణ మూర్తి*
*విశాఖపట్నం*: రాజకీయాలను వదిలేసినంత మాత్రాన మాజీ ఎంపి విజయసాయి రెడ్డి చేసిన అక్రమాలు మాయం అవ్వపని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జెవి సత్యనారాయణ మూర్తి స్పష్టం చేశారు. గత జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలను అడ్డం పెట్టుకొని విజయసాయి రెడ్డి చేసిన అడ్డుగోలు వ్యవహారాలు అన్నిటిపై హైకోర్టు సిటింగు జడ్జి నేత్రత్వంలో విచారణ జరపాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండు చేశారు.
మంగళవారం నగరంలో అల్లిపురంలోని సిపిఐ జిల్లా కార్యాలయం నీలం రాజశేఖర్ రెడ్డి భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సత్యనారాయణ మూర్తి మాట్లాడారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని విజయసాయి రెడ్డి చేసిన అక్రమాలు, ఆగడాల