10 ఫిబ్రవరి 2021న ప్రైవేటీకరణ ప్రకటన దశలోనే @PawanKalyan గారు డిల్లీ వెళ్లి కేంద్రంలో అధికారులను, కేంద్ర హోం మంత్రి @AmitShah గారిని కలిసి విశాఖ ఉక్కు కర్మాగారం 32మంది ప్రాణత్యాగం వల్ల వచ్చిందని దీని వెనుక తెలుగు ప్రజల సెంటిమెంటు ఉందని కాబట్టి పెట్టుబడుల ఉపసంహరణ పరిశ్రమల నుండి మినహాయింపు ఇవ్వండని ప్రాడేయపడ్డారు.
ఆ తరువాత కార్మిక సంఘాలు, నిర్వాసితులు ఉద్యమాలు మొదలుపెట్టారు..
30 అక్టోబరు 2021న విశాఖ ఉక్కు కర్మాగారం ప్రాంగణంలో అన్ని కార్మిక సంఘాలను ఏకం చేసి, “అన్ని కార్మిక సంఘాలతో అన్ని రాజకీయ పార్టీలతో ఒక అఖిలపక్షం వేయండి నేను మీతో వస్తా కేంద్రాన్ని ఒప్పిద్దాం” అని నీరసించిన ఉద్యమానికి మళ్లీ ఊపిరి పోసింది పవన్ కళ్యాణ్ గారే. ఆ మరుసటి రోజే సంఘాల నాయకులు భిన్న స్వరాలు, @YSRCParty గాడిదలు ఓండ్రింపులు చూసాం..
మళ్లీ మంగళగిరిలో @PawanKalyan గారు 12 డిసెంబర్ 2021 ఒక రోజు ఉపవాస దీక్ష చేస్తే కార్మిక సంఘాలు వైసిపి నాయకుల వెనక బాకాలు ఊదుతూ తిరిగాయి..
మొత్తం మీద తాము అధికారంలో ఉన్న ఐదేళ్లు ప్లాంట్ కోసం అఖిలపక్షం వెయ్యకుండా, కేంద్రాంపై వత్తిడి తేకుండా తాత్సారంచేసి, ప్లాంట్ ప్రైవేటీకరణ పూర్తిగా సహకరించిన వ్యక్తి @ysjagan గారిని కార్మిక సంఘాల నాయకులను బహిరంగంగా నిలదీయాలి..
మళ్ళీ నిన్న బొత్సా గారు, ఈరోజు సాయి రెడ్డి గారు ఇన్నాళ్లూ మేం ఆపాం అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు ఇలాంటి వాళ్లకు ప్రజలే బుద్ధి చెప్పాలి..
ఇప్పుడు విశాఖ ఉక్కు యువ కార్మిక నాయకులు ఏ ముఖం పెట్టుకొని మంగళగిరి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని కలుస్తారు?? ముందు ఈ పరిస్థితికి కారకులైన మీ నాయకులను రాజకీయ నాయకులను నిలదీయండి, భరతం పట్టండి అప్పుడు వెళ్ళండి మంగళగిరి.. మీకు విలువా ఉంటుంది ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగతుంది
#SaveVizagSteelPlant
#Visakhapatnam
@JanaSenaParty
@JSPShatagniTeam
@ncbn
@JaiTDP
@BJP4India
#VizagSteel
#విశాఖఉక్కు_ఆంధ్రులహక్కు