50
పది రోజుల తర్వాత ఇంటికెళ్లిన చంద్రబాబు
ఏపీ సీఎం చంద్రబాబు పది రోజుల తర్వాత ఉండవల్లిలోని తన నివాసానికి వెళ్లారు. విజయవాడ వరదలు సంభించినప్పటి నుంచి ఆయన కలెక్టరెట్లోనే ఉండి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. పరిస్థితి అదుపులోకి రావడంతో ఆయన మంగళవారం సాయంత్రం ఇంటికి చేరుకున్నారు. మరోవైపు రేపు ఉత్తరాంధ్రాకు వెళ్లి అక్కడ వరదల కారణంగా నష్టపోయిన వారిని సీఎం పరామర్శిస్తారు.