ములుగు జిల్లా
రామప్ప దేవాలయానికి చేరుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ….
ములుగు జిల్లా పర్యటన లో భాగంగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ రామప్ప దేవాలయానికి రాష్ట్ర పంచాయితి రాజ్, గ్రామీణాభివృద్ధి, స్ర్తీ, శిశు సంక్షేమ, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, భద్రాచలం శాసనసభ సభ్యుడు తెల్లం వెంకటరావు , భూపాలపల్లి శాసనసభ సభ్యులు గండ్ర సత్యనారాయణ రావు , గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ బి.వెంకటేశం, జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్, ఎస్పి షభరిష్ లతో కలిసి రామప్ప దేవాలయానికి చేరుకున్నారు.
రామప్ప ఆలయ ప్రాంగణం లో పోలీస్ ల గౌరవ వందనం స్వీకరించారు.
రాష్ట్ర గవర్నర్ దేవాలయ వేద పండితులు సంప్రదాయ వాయిద్యాల నడుమ పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు.
రాష్ట్ర గవర్నర్ రుద్రేశ్వరుడినీ దర్శించుకుని గవర్నర్ ప్రత్యెక పూజలు చేశారు. వేద పండితులు గవర్నర్ ను పట్టు వస్త్రాల తో సత్కరించి , ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలను అందించారు.
ఈ కార్యక్రమంలో ఐటిడిఏ ఏటూరు నాగారం పిఓ చిత్ర మిశ్రా, డి ఎఫ్ ఓ రాహుల్ కిషన్ జాదవ్, ఆర్డీఓ సత్య పాల్ రెడ్డి సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
[8/27, 6:01 PM] +91 97031 65262: *ములుగు జిల్లా*
ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో *రాష్ట్ర గవర్నర్ శ్రీ జిష్ణు దేవ్ వర్మ* జిల్లాకు చెందిన రచయితలు, కవులు, కళాకారులు, జాతీయ, అంతర్జాతీయ క్రీడా అవార్డు గ్రహీతలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులలు (ప్రొఫెసర్ పాండురంగారావు) ఇన్ టాక్ , డాక్టర్ రాచర్ల గణపతి, (రచయిత) డాక్టర్ అంబటి శ్రీజన్, అసిస్టెంట్ ప్రొఫెసర్, చల్ల మౌనిక, (రెజ్లింగ్ క్రీడాకారిని,) పి రజిత, (జిమ్నాస్టిక్,) పాలడుగు వెంకటేశ్వరరావు, (వాలీబాల్ గోల్డ్ మెడలిస్ట్) కాజంపురం దామోదర్, (ఎన్విరాన్మెంట్ సైన్సిస్ట్) కొమరం ప్రభాకర్, (సోషల్ వర్కర్) నేషనల్ అంబేద్కర్ ఫెలోషిప్ అవార్డు గ్రహీత, డాక్టర్ కొండల రామయ్య, (మ్యాథమెటిక్స్ టీచర్) తదితరులతో పరిచయ కార్యక్రమం, చర్చగోష్టి వారితో కలసి భోజనం చేశారు.
ఈ కార్యక్రమంలో *రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్ రమణ, జిల్లా కలెక్టర్ టీఎస్ దివాకర్, ఎస్పీ డాక్టర్ పి.శబరిష్, డిఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) శ్రీజ, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) మహేందర్ జీ,*
[8/27, 6:01 PM] +91 97031 65262: *గవర్నర్ కు ఘన స్వాగతం*
*ములుగు జిల్లాలో కొనసాగుతున్న పర్యటన*
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ మూడు రోజుల పర్యటన లో భాగంగా మంగళవారం ఉదయం ములుగు జిల్లా కు చేరుకున్నారు. గవర్నర్ తోలుత యాదాద్రి జిల్లా పర్యటన అనంతరం రోడ్ మార్గంలో ములుగు జిల్లా కు అండ్ బి గెస్ట్ హౌస్ కు చేరుకున్నరు. గవర్నర్ కు రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్ రమణ, జిల్లా కలెక్టర్ టీఎస్ దివాకర ఎస్పీ డాక్టర్ పి.శబరిష్, డిఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) శ్రీజ, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) మహేందర్ జీ, తదితరులు పూల మొక్కలు అందజేసి సాదర స్వాగతం పలికారు.సంప్రదాయ నృత్య రితులతో గవర్నర్ కు స్వాగతం పలికారు.