5
విశాఖలో థార్/దాహోడ్ దొంగల ముఠా కలకలం.
క్రైమ్ పోలీసుల హెచ్చరిక.
విశాఖ:
విశాఖలోని గాజువాక ఇండస్ట్రియల్ ఏరియాతో పాటు పలు ప్రాంతాల్లో వరుస దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో నగర క్రైమ్ పోలీసులు ప్రజలను అప్రమత్తం చేశారు.ప్రస్తుతం నగరంలో థార్/దాహోడ్ అనే ప్రమాదకర దొంగల ముఠా సంచరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.ఆరుగురు సభ్యులు గల ఈ గ్యాంగ్ ఇనుప రాడ్లతో తిరుగుతూ దొంగతనాలకు పాల్పడుతోంది.ఇళ్లకు తాళాలు వేసి బయటకు వెళ్లేవారు విలువైన వస్తువులు,నగదు విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమాచారం అందించాలని కోరారు.