జాతీయ కాలుష్య నివారణ దినోత్సవం జయప్రదం చేయండి #vvwnews

by vvwnews.com

జాతీయ కాలుష్య నివారణ దినోత్సవం జయప్రదం చేయండి
– కాలుష్యం నివారణకు కృషి చేయండి
– ఒక్కసారి వాడి వదిలేసే ప్లాస్టిక్ వద్దే వద్దు
– మన సముద్రాలను మనమే కాపాడుకుందాం
– జెవి రత్నం వ్యవస్థాపక కార్యదర్శి, గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జి ఒ
జాతీయ కాలుష్య నివారణ దినోత్సవం జయప్రదం చేయండి అని గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జి ఒ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం కోరారు. మంగళవారం విశాఖపట్నం లోని పెద్ద జాలారి పేటలో ఎ ఎస్ రాజా మహిళా జూనియర్ కళాశాల విద్యార్థులు బీచ్ క్లీనప్ కార్యక్రమాన్ని ప్రిన్సిపాల్ డాక్టర్ కాసు నేతృత్వంలో, ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ లు సుశీల, స్వాతి ల పర్యవేక్షణలో నిర్వహించారు. అనంతరం జరిగిన సమావేశంలో రత్నం మాట్లాడుతూ కాలుష్యం నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఒక్కసారి వాడి వదిలేసే ప్లాస్టిక్ వద్దే వద్దు ని పిలుపునిచ్చారు. మన సముద్రాలను మనమే కాపాడుకుందాం అని, సముద్రాలు చెత్త కుండీలు కావని వివరించారు. ఇంటి వద్ద కూరగాయల పంటలు పండించడం ఎలా అనేది వివరించారు.
ఈ కార్యక్రమంలో మిద్దె తోట రైతు అన్నపూర్ణ అవగాహన కల్పించారు, ఏక్షన్ ఎయిడ్ కర్ణాటక ప్రాజెక్ట్స్ అనకాపల్లి హెచ్ ఆర్ డి ఐ.కృష్ణ కుమారి తదితరులు మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో ఎపి పిసిబి, కోరమాండల్ ఫెర్టలైజర్స్, గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జి ఒ లు అందజేసిన గుడ్డ సంచులు విద్యార్థులకు పంపిణీ చేశారు, ఇంటింటికీ వంగ, టమాటా, పచ్చిమిర్చి, పచ్చి మిర్చి మొక్కలు పంపిణీ చేశారు. ఒక్క సారి వాడి వదిలేసే ప్లాస్టిక్ వద్దే వద్దు అనె నినాదాలతో ఊరేగింపు నిర్వహించారు

Use Social Media to Spread the Word about Our News

related articles