35
స్పేస్ నుంచి ఇండియా అద్భుతంగా ఉంది: సునీత
అంతరిక్షం నుంచి భారత్ అద్భుతంగా ఉందని సుదీర్ఘకాలం స్పేస్లో గడిపి ఇటీవలే భూమిపైకి వచ్చిన నాసా వ్యోమగామి సునీత విలియమ్స్ తెలిపారు. తాను, విల్మోర్ హిమాలయాల మీదుగా వెళ్లినప్పుడు మంచి ఫొటోలు తీసినట్లు చెప్పారు. త్వరలో నాసా చేపట్టబోయే మిషన్లో IND ఎయిరో ఫోర్స్ పైలట్ శుభాంశు శుక్లా అంతరిక్షంలోకి వెళ్లనుండటం మంచి పరిణామమని పేర్కొన్నారు. అద్భుతమైన ప్రజాస్వామ్యం ఉన్న భారత్ గొప్ప దేశమని ఆమె కొనియాడారు.