3
విశాఖ 48 వార్డు లో శ్రీ సంపత్ వినాయక దుర్గా సాయిఆలయం 18 వార్షిక మహోత్సవములు కంచరపాలెం బాబూజీనగర్ లో అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారి కుమార్తె అయిన దీపిక, అలాగే జనసేన ఉత్తర నియోజకవర్గం ఇంచార్జ్ పసుపులేటి ఉషాకిరణ్ , జనసేన వార్డ్ అధ్యక్షులు ఉప్పులూరి శ్రావణ్ కుమార్, ఆలయ ప్రెసిడెంట్ కర్రీ శంకర్రావు పాల్గొనడంl జరిగింది. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు మాట్లాడుతూ. అమ్మవారి ఆశీస్సులు అందరికీ మెరుగ్గా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థించడం జరిగింది. ఉత్తర నియోజకవర్గం లో ఏ కార్యక్రమాలు చేసిన. ముందు ఉండి నడిపిస్తామని అన్నారు.