రూ.10 కోట్ల ప్రభుత్వ భూమినీ స్వాహా చేసిన జనసేన నేత జీ.కే* #vvwnews

by vvwnews.com

*రూ.10 కోట్ల ప్రభుత్వ భూమినీ స్వాహా చేసిన జనసేన నేత జీ.కే*

* *500 గజాల్లో అక్రమ షెడ్డు నిర్మాణం..వ్యాయామశాల పేరుతో వసూళ్లు*

* *అక్కడి ఫ్రీగా జీవీఎంసీ నీరు, విద్యుత్ వాడేస్తున్న వైనం*..

* *తక్షణమే చర్యలు తీసుకోకుంటే మరింత పోరాటం ఉధృతం చేస్తాం*

* *వైసీపీ శ్రేణులతో కలిసి ధర్నా చేసిన మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి*

దక్షిణ నియోజకవర్గం *33 వ వార్డు జనసేన మాజీ కార్పొరేటర్ భర్త జీకే రూ.10 కోట్ల విలువచేసే ప్రభుత్వ భూమిని కబ్జా చేసి 500గజాల్లో అక్రమ షెడ్డు నిర్మించడం తీవ్ర దుమారం రేపుతోందని మాజీ ఎమ్మెల్యే దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెల్లవారేసరికి నీతులు బోధించే పవన్ కళ్యాణ్ పార్టీ నేత జీకే అలియాస్ గోపాలకృష్ణ అక్రమంగా షెడ్ వెయ్యడమే కాకుండా వ్యాయామశాల నెలకొల్పి వారి దగ్గర నుండి డబ్బులు వసూలు చేస్తున్నారని వాసుపల్లి ఆరోపించారు.దక్షిణ వైసీపీ శ్రేణులతో కలిసి 33 వ వార్డు నీలమ్మ వేపచెట్టు ఎంజీఎం స్కూల్ సమీపంలో ఆక్రమ స్థలం వద్ద శుక్రవారం ర్యాలీగా వచ్చి ధర్నా చేశారు*. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి మీడియాతో మాట్లాడుతూ
*33 వ వార్డు వైసిపి అధ్యక్షుడు ముత్తా బత్తుల రమేష్, మాజీ కార్పొరేటర్ పచ్చిరపల్లి రాము ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్ గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశారన్నారు.

Use Social Media to Spread the Word about Our News

related articles