సింహాచల పుణ్యక్షేత్రంలో వైభవంగా ధనుర్మాస ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఆరవ పాశుర పారాయణం

by vvwnews.com

*​సింహాచల పుణ్యక్షేత్రంలో వైభవంగా ధనుర్మాస ఉత్సవాలు*

*భక్తిశ్రద్ధలతో ఆరవ పాశుర పారాయణం*

​సింహాచలం

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో ధనుర్మాస ఉత్సవాలు కన్నులపండువ గా కొనసాగుతున్నాయి ఆదివారం వేకువజామున జరిగిన ధనుర్మాస వ్రత మహోత్సవంలో భాగంగా గోదాదేవి రచించిన తిరు ప్పావైలోని ఆరవ పాశుర పారాయణాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు
ఈ వేడుకలు ఆలయ స్థానా చార్యులు డాక్టర్ టి.పి. రాజ గోపాల్ పర్యవేక్షణలో అర్చక స్వాములు వేద పండితులు శాస్త్రోక్తంగా జరిపించారు ఆరవ పాశురమైన “పుళ్ళమ్ శిలంబినకాణ్” విశిష్టతను, అందులోని అంతరార్థాన్ని ఆయన భక్తులకు వివ రించారు పరమాత్మను మేల్కొలిపే క్రమంలో పక్షుల కిలకిలారావాలు ముని గణాలు చేసే హరినామ స్మరణ ఏ విధంగా భక్తుడిని ఆధ్యాత్మికంగా జాగృతం చేస్తాయో రాజగోపాల్ వివ రించారు స్వామివారికి ధనుర్మాస ప్రత్యేకఆరాధనలు నైవేద్యాలు సమర్పించారు భక్తులు వేకువజామునే ఆలయానికి చేరుకుని గోదా-రంగనాథుల అను గ్రహం కోసం జరిగిన ఈ పారా యణంలో పాల్గొన్నారు ​ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు,అర్చకస్వాములు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలను స్వీక రించారు ధనుర్మాసం ముగిసే వరకు ప్రతిరోజూ వేకువ జామున ఈ పాశుర పారాయణం కొనసాగు తుందని ఆలయ వర్గాలు వెల్లడించాయి.

Use Social Media to Spread the Word about Our News

related articles