*విశాఖ:-*
*ఋషికొండ ఐటి సెజ్ వెళ్ళే మార్గంలో సి.ఆర్.జెడ్ లో అక్రమ నిర్మాణాలు పై జిల్లా కలెక్టర్,జీవీఎంసీ కమీషనర్,చీఫ్ సిటీ ప్లానర్ కు ఫిర్యాదు చేసిన జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్*
*78 వ స్వాతంత్ర్య దినోత్సవ రోజున కూడా విశాఖ భూములను వదలని భూ బకాసురులు…*
*విశాఖపట్నం చినగదిలి మండలం రుషికొండ గ్రామం సర్వే నెం:2/16లో IT SEZ కు వెళ్లే బీచ్ రహదారిలో కొందరు ప్రవేట్ వ్యక్తులు తీరప్రాంత క్రమబద్దీకరణ మండలి(CRZ)-2011/2019 నోటిఫికేషన్ ప్రకారం జోన్-I, పరధిలో అభివృద్ధి నిషేధ ప్రాంతం (No Development Zone) లోనికి వస్తున్నా ప్రదేశంలో సహజసిద్దంగా ఏర్పడి ఉన్న ఇసుకుతిన్నెలపైన బండరాళ్లు మరియు గ్రావెల్ వేసి ఇసుకతిన్నెలను విధ్వంసం చేస్తున్నారు…*
*తీర ప్రాంతం లొ శాశ్వత కాంక్రీట్ నిర్మాణాలు చేస్తూ పర్యావరణ విఘాతం కలిగిస్తున్నారు…*
*ఇప్పటికే ఈ నెల 11వతేదీన మండల రివెన్యూ అధికారులకు మరియు జీవీఎంసీ జోన్-2 పట్టణ సహాయ ప్రణాళిక అధికారి గారికి మూర్తి యాదవ్ పిర్యాదు చేసినా ఫలితం సూన్యం…*
*భారీ యంత్రాలు తో చేపడుతున్న అక్రమ నిర్మాణ పనులు పై ఇప్పటి వరకు ఏటువంటి చర్యలు తీసుకోనీ అధికార యంత్రాంగం…*
*రాష్ట్ర హై కోర్టు ఆదేశాలు ను పెడచెవిన పెడుతున్న జిల్లా అధికార గణం…*
*హై కోర్ట్ ఆదేశాలు పాటించక పోతే మరో సారి కోర్ట్ దిక్కరణ కిందకు వస్తుంది కాబట్టి కోర్టు ను ఆశ్రయిస్తా…*
*గతంలో రాజ్య సభ సభ్యుడు విజయ సాయి రెడ్డి కుమార్తె సైతం భీమలి తీరంలో ఈ తరహా దందా నిర్వహించిన ఘటనలు వున్నాయి…*